Breaking News

దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

సారథి న్యూస్​, కర్నూలు: జిల్లాలోని దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని దళిత పారిశ్రామిక సంఘ జాతీయ అధ్యక్షుడు డాక్టర్​ మామిడి సుదర్శన్‌ అన్నారు. కర్నూలు జిల్లా పరిశ్రము, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సభ్యుడు జెరదొడ్డి జయన్న నేతృత్వంలో ఆదివారం కోల్స్‌ తొగు బాప్టిస్ట్‌ చర్చ్‌ వెనుక దళిత పారిశ్రామిక సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్​మామిడి సుదర్శన్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్‌కుమార్‌, డాక్టర్​ మోహన్‌ రావు, బీజేపీ జిల్లా నాయకులు మోజెస్‌, టీడీపీ జిల్లా నాయకు జేమ్స్‌, మాజీ సర్పంచ్‌ సిమియో, నాగరాజు, కృష్ణబాబు రాజు, మురళి, సందీప్‌, గిడ్డమూర్తి, అశోక్‌, చిన్న, వినోద్‌, జోయల్‌ పాల్గొన్నారు.