Breaking News

తెలంగాణలో 30,945 కేసులు

తగ్గని కరోనా మహమ్మారి

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గడం లేదు. తాజాగా గురువారం 1,410 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్​ కేసులు 30,945కు చేరాయి. తాజాగా ఏడుగురు మృతి, ఇప్పటి వరకు 331 మంది మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 918 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 125 కేసులు, మేడ్చల్​ జిల్లాలో 67, సంగారెడ్డి 79, వరంగల్​ అర్బన్​జిల్లాలో 34 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,40,755 కరోనా పరీక్షలు నిర్వహించారు.