Breaking News

తెలంగాణలో 2,892 పాజిటివ్ ​కేసులు

తెలంగాణలో 2,892 పాజిటివ్​కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం (24 గంటల్లో) 2,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,30,589 నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 846కు చేరింది. ఒక్కరోజే 2,240 మంది కోవిడ్‌ రోగులు డిశ్చార్జ్​కాగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 97,402కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,341కు చేరింది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 ఉండగా.. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 74.5 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 59,491 శాంపిళ్లను టెస్ట్​చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 477 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​

జిల్లాల వారీగా కేసుల పరిశీలిస్తే.. ఆదిలాబాద్​ 38, భద్రాద్రి కొత్తగూడెం 81, జగిత్యాల 102, జనగామ 43, జయశంకర్ ​భూపాలపల్లి 21, జోగుళాంబ గద్వాల 28, కామారెడ్డి 64, కరీంనగర్​152, ఖమ్మం 128, మహబూబ్​నగర్​ 53, మహబూబాబాద్ ​61, మంచిర్యాల 83, మెదక్​32, మేడ్చల్​ మల్కాజిగిరి 192, ములుగు 27, నాగర్​కర్నూల్ ​45, నల్లగొండ 174, నిర్మల్​31, నిజామాబాద్​110, పెద్దపల్లి 85, రాజన్నసిరిసిల్ల 39, రంగారెడ్డి 234, సంగారెడ్డి 71, సిద్దిపేట 108, వనపర్తి 51, వరంగల్ ​రూరల్ ​38, వరంగల్ ​అర్బన్ ​116, యాదాద్రి భువనగిరి 60 చొప్పున పాజిటివ్ ​కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.