Breaking News

డిసెంబర్​ నాటికి పేదలకు 85వేల ఇళ్లు

డిసెంబర్​నాటికి పేదలకు 85వేల ఇళ్లు

సారథి న్యూస్, హైదరాబాద్: నగర శివారులోని కొల్లూరు సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్పీకర్ ​పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు గురువారం సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సుమారు 85వేల ఇళ్లను పేదలకు అందించనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం అక్కడి కాంట్రాక్టర్ ఏజెన్సీలతో పాటు అధికారులతో సమావేశమయ్యారు. అంతకుముందు నిర్మాణం పూర్తయిన ఇళ్లలోకి వెళ్లి స్వయంగా పరిశీలించారు. మంత్రులతో కలిసి హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. జీహెచ్ఎంసీ, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.