Breaking News

టీ.సైబర్ తో మరిన్ని సేవలు

సారథి న్యూస్​, హైదరాబాద్​​: టీ.సైబర్ ప్రాజెక్టుతో విద్యావైద్యం, సాగు నీటి రంగాల్లో ప్రజలకు త్వరితగతిన సేవలు అందుతాయని అన్నారు. మంత్రి కె.తారక రామారావు అన్నారు. టీ.సైబర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంగళవారం ఇన్​ఫర్​మేషన్​ అండ్​ టెక్నాలజీ(ఐటీ) శాఖ అధికారులతో సమీక్షించారు. నాలుగేళ్లలో ఏ గ్రామంలో ఏం పనులు చేయాలనే విషయమై ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ వివరాలతో డిస్ట్రిక్ట్ కార్డును తయారుచేయాలని సీఎం కేసీఆర్​ చెప్పారని గుర్తుచేశారు.
మంత్రి పర్యటన రద్దు
మంత్రి కేటీఆర్​ ఈనెల 17న వరంగల్ జిల్లా పర్యటన రద్దయిందని అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పర్యటను వాయిదా వేసినట్లు వెల్లడించారు.