Breaking News

టిక్​టాక్​ నిషేధంతో నిరుద్యోగం

కోల్‌కతా: టిక్​టాక్​ మొబైల్​ యాప్​పై నిషేధం విధించడం వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుందని తృణముల్​ కాంగ్రెస్​ ఎంపీ నుస్రత్​ జహాన్​ వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం టిక్​టాక్​తో సహా మొత్తం 59 యాప్​లపై నిసేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై నుస్రత్ ​ స్పందించారు. కోల్‌కతాలోని ఇస్కాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టిక్‌టాక్‌ ఒక వినోదకరమైన యాప్‌ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టాక్‌టాన్‌పై విధించిన నిషేధం ఒక హఠాత్తు పరిణామం అని మండిపడ్డారు. చైనాకు చెందిన యాప్స్‌ను నిషేధించడం వల్ల దేశంలోని యువత నిరుద్యోగులుగా మారితే వారిని ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు. టిక్​టాక్​పై నిషేధం కూడా పెద్దనోట్ల రద్దు వంటి సంచలనాత్మక నిర్ణయేమనని వ్యాఖ్యానించారు. భావోద్వగంలో ఉన్నప్పుడు ఇవి సరైన నిర్ణయాలుగానే అనిపిస్తామన.. ఆ తర్వాతే వీట పర్యవసాలను మనం ఎదుర్కోవలిసి వస్తుందని వ్యాఖ్యానించారు.