Breaking News

జోగుళాంబ సన్నిధిలో మంత్రి నిరంజన్​రెడ్డి

జోగుళాంబ సన్నిధిలో మంత్రి నిరంజన్​రెడ్డి

సారథి న్యూస్, అలంపూర్: అలంపూర్ ​జోగుళాంబ అమ్మవారిని దసరా నవరాత్రుల సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొన్నారు. జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య పూలమొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో అలంపూర్​ఎమ్మెల్యే వీఎం అబ్రహాం, నాయకులు కిషోర్​కుమార్, అలంపూర్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.

మంత్రి నిరంజన్​రెడ్డికి స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే అబ్రహారం, జడ్పీ చైర్​పర్సన్​ సరిత