![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/alp-final.jpg?fit=1158%2C511&ssl=1)
సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపురం పుణ్యక్షేత్రమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల హుండీలను ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో మంగళవారం లెక్కించారు. హుండీలో రెండు యూఎస్ డాలర్లు, ఐదు యూరోలు లభించాయి. వీటితో పాటు అమ్మవారి ఆలయంలో 62.800 మి.గ్రా. మిశ్రమ బంగారం, 620 మి.గ్రా మిశ్రమ వెండి వచ్చింది. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో 110మి.గ్రా. మిశ్రమ వెండి, ఒక యూఎస్ డాలర్ వచ్చింది. అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.65,463 ఆదాయం సమకూరింది. మొత్తంగా రూ.55,68,781 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు.తహసీల్దార్ మదన్ మోహన్, ఆలయ ముఖ్య అర్చకుడు దిండిగల్ ఆనంద్ శర్మ, శేఖర్, శ్రీనివాసులు, రంగనాథ్, బ్రహ్మయ్య ఆచారి, ధనుంజయ శర్మ, త్యాగరాజు, కృష్ణమూర్తి శర్మ, వివేకానంద యూత్, జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.