Breaking News

జిల్లాలకు విస్తరిస్తున్న కరోనా

సారథిన్యూస్​, సిద్దిపేట/ఖమ్మం: హైదరాబాద్​కే పరిమితమైందనుకున్న కరోనా క్రమంగా జిల్లాలకూ విస్తరిస్తున్నది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఇద్దరికి కరోనా పాజిటివ్​ అని తేలింది. ప్రస్తుతం అందులో ఒకరు పరారీలో ఉన్నాడు. మరొకరు హైదరాబాద్ గాంధీ దవాఖానలో చికిత్సపొందుతున్నట్టు సమాచారం. వారిద్దరూ హైదరాబాద్​లోని ఓ మార్కెట్లో పనిచేస్తున్నారని తెలిసింది. మరోవైపు ఖమ్మం జిల్లా తల్లాడ పట్టణంలో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. దీంతో అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. తహసీల్దార్​ గంటా శ్రీలత, ఎంపీడీవో రవీంద్ర రెడ్డి, మండల వైద్యాధికారి డాక్టర్ నవ్య కాంత్, సర్పంచ్ సంధ్యారాణి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.