Breaking News

జారిపడ్డ నన్నపనేని.. తలకు తీవ్రగాయం

సారథిన్యూస్​, తెనాలి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి ఆదివారం ప్రమాదవశాత్తు తన ఇంట్లో జారిపడ్డారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆమెకు ఆస్పత్రిలో ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత లోకేశ్​, ఇతర సీనియర్​ నేతలు నన్నపనేని రాజకుమారి కుటుంబసభ్యులకు ఫోన్​చేసి ఆరోగ్య వివరాల గురించి ఆరా తీశారు. మరోవైపు చంద్రబాబునాయుడు వైద్యులకు ఫోన్​చేసి ఆమెకు మెరుగైన చికిత్స నందించాలని సూచించారు.