![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/PRASHANTH-BHUSHANNFF-1.jpg?fit=700%2C350&ssl=1)
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకేసులో దోషిగా తేలిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు సుప్రీంకోర్టు రూ. 1 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రశాంత్ భూషణ్.. గత జూన్ 27, 29 తేదీల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వివాదాస్పద ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్లను ఎస్ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. ఆయనపై ‘ధిక్కార మరియు పరువు నష్టం’ కేసులు నమోదు చేసి విచారించింది. ఈ కేసుపై విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. సోమవారం తీర్పును వెలువరించింది.