![షార్ట్ న్యూస్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/short-news-e1587967780849.jpg?fit=229%2C173&ssl=1)
సారథిన్యూస్, చొప్పదండి: చొప్పదండి నియోజకవర్గంలోని పలు చెరువులను ఎల్లంపల్లి జలాశయం నీటితో నింపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎల్లంపల్లి జలాశయ నీటితో చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్ రిజర్వాయర్, మైసమ్మ చెరువు, పోతారం రిజర్వాయర్, ఫాజుల్ నగర్ చెరువు నింపాలని ఎమ్మెల్య రవిశంకర్.. సీఎంను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి ఎల్లంపల్లి నీటితో చెరువులు నింపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.