Breaking News

చైనాలో మరో కొత్త వైరస్

చైనాలో మరో కొత్త వైరస్ విజృంభణ

బీజింగ్​ : చైనాలోని వుహాన్ నుంచి వెలువడిన కరోనా మహమ్మారి కరోనా వైరస్​తో ప్రపంచం ఇంకా పోరాడుతుండగా, మరో కొత్త వైరస్ వ్యాప్తి అక్కడి వైద్యులకు నిద్ర లేకుండా చేస్తోంది. చైనా దినపత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ కథనం ప్రకారం, టిక్-కాటు ద్వారా వెళ్లే కొత్త రకం వైరస్ చైనాలో ఉద్భవించింది. ఎస్​ఎఫ్​టీఎస్​(సివియర్​ ఫీవర్​ విత్​ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్​) వైరస్​ గా పిలుస్తున్న దీనివల్ల ఇప్పటికే కనీసం ఏడుగురు ప్రాణాలను కోల్పోయారు. దాదాపు 60 మందికి పైగా ఈ కొత్త వైరస్ వ్యాధి బారిన పడ్డారని నివేదిక పేర్కొంది. ఈ వైరస్ పందుల ద్వారా వ్యాప్తి అవుతోందని ఒక ప్రాథమిక అంచనా కొచ్చారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్​ వరకు చైనాలోని జియాంగ్స్​ ప్రావిన్స్​లో 37కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్​ 2010లోనే చైనాలో ఉనికిలోకి వచ్చిందని ఆ తర్వాత జపాన్​, కొరియాల్లోనూ ఈ తరహా కేసులు వెలుగు చూసినట్లు కొందరు సైంటిస్ట్​లు చెబుతున్నారు. ఇది సోకిన వారిలో జ్వరం, దగ్గు లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. మరణాలరేటు 10నుంచి 16శాతంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇది కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుందని మనుషుల నుంచి మనుషులకు వచ్చే అస్కారం లేదని చెప్పుకొచ్చారు.