Breaking News

చేర్యాలను రెవెన్యూ డివిజన్​ చేయండి

చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయండి

సారథి న్యూస్, హుస్నాబాద్: చేర్యాలను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్​ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అన్ని అర్హతలు ఉన్న చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్​గా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, చిరంజీవులు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జెడ్పీటీసీ కళావతి, బీజేపీ మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమారాణి, ఫార్వర్డ్​ బ్లాక్ పార్టీ జిల్లా కార్యదర్శి బీరన్న, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్, సీపీఐ పట్టణ కార్యదర్శి అంజయ్య గౌడ్, ఐఎఫ్ టీయూ జిల్లా నాయకులు మహేందర్, పీడీఎస్ యూ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నరేశ్​, వికలాంగుల హక్కుల సంఘం అధ్యక్షుడు రమేశ్​, మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సత్యనారాయణ, మరో 40 మంది పాల్గొన్నారు.