Breaking News

చెరువులు కబ్జా చేస్తే కేసులు

సారథిన్యూస్​, బిజినేపల్లి: చెరువులు, కుంటలను కబ్జా చేస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి తహసీల్దార్​ అంజిరెడ్డి హెచ్చరించారు. రెండ్రోజుల నుంచి బిజినేపల్లి సమీపంలోని సాఖ చెరువులో కొందరు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదులందాయి. దీంతో ఆయన చెరువును పరిశీలించారు. అక్రమంగా మట్టిని తవ్వి చెరువులు పూడ్చిన వారి వివరాలను సేకరించారు. ఆయన వెంట నీటిపారుదలశాఖ అధికారులు రమేశ్​, ఆర్​ఐ అలీబాబా నాయుడు తదితరులు ఉన్నారు.