![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/CHERUVUUU-BJPALLY.jpg?fit=749%2C471&ssl=1)
సారథిన్యూస్, బిజినేపల్లి: చెరువులు, కుంటలను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి తహసీల్దార్ అంజిరెడ్డి హెచ్చరించారు. రెండ్రోజుల నుంచి బిజినేపల్లి సమీపంలోని సాఖ చెరువులో కొందరు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదులందాయి. దీంతో ఆయన చెరువును పరిశీలించారు. అక్రమంగా మట్టిని తవ్వి చెరువులు పూడ్చిన వారి వివరాలను సేకరించారు. ఆయన వెంట నీటిపారుదలశాఖ అధికారులు రమేశ్, ఆర్ఐ అలీబాబా నాయుడు తదితరులు ఉన్నారు.