![చెత్తబుట్టలు ఏర్పాటుచేసుకోవాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/KNL.jpg?fit=1280%2C576&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల చేత ప్రతి ఇంటిలో నుంచి చెత్తను సేకరించాక ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ ను స్కాన్ చేయించాలని కమిషనర్ డీకే బాలాజీ శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన నగరంలోని కృష్ణానగర్, మద్దూర్ నగర్, అశోక్ నగర్, వెంకటరమణ కాలనీ, బాలాజీ నగర్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతి దుకాణం వారు కచ్చితంగా చెత్తబుట్టలను ఏర్పాటు చేసుకోవాలని, లేకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కమిషనర్వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు హరినాథ్, ఆంజనేయగౌడ్ ఉన్నారు.