Breaking News

చిల్డ్రన్ పార్క్ ను కబ్జా చేసేందుకు కుట్ర

చిల్డ్రన్ పార్క్ ను కబ్జా చేసేందుకు కుట్ర

సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్​ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ని చిల్డ్రన్ పార్కు లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడంపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. కబ్జాచేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆక్షేపించారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ జ్యోతిసురేష్ నాయక్ అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ ​నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. నర్సాపూర్ చెరువులో పెద్దఎత్తున ఇసుకను తవ్వుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పేదలు ఇంటి బాత్​రూమ్​ను కట్టుకోవడానికి ట్రాక్టర్ ఇసుకను తీసుకొస్తే పెనాల్టీని వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

సమావేశానికి హాజరైన సర్పంచ్​లు, ఎంపీటీసీ సభ్యులు

పాత తహసీల్దార్ ​భవనంలో ప్రస్తుతం కూరగాయలు, చేపల మార్కెట్ నడిపించడం సరైంది కాదన్నారు. కొందరు చిల్డ్రన్స్ ​పార్కును కబ్జా చేసేందుకే కూరగాయల మార్కెట్ ను మార్చారని ఆక్షేపించారు. పాత తహసీల్దార్​ ఆఫీసు స్థలంలోనే నూతన భవనాన్ని కట్టాలని సభ్యులు డిమాండ్ చేశారు. సమావేశానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్​మాలతి, ఎంపీడీవో మార్టిన్ లూథర్, సీడీపీవో హేమభార్గవి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.