Breaking News

చిట్టీల వ్యాపారి రిమాండ్

చిట్టీల వ్యాపారి రిమాండ్


సారథి న్యూస్, బిజినేపల్లి: చిట్టీల వ్యాపారంతో పలువురిని మోసం చేసిన ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్సై వెంకటేష్ శనివారం తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన మనసాని రమేష్వి విధ గ్రామాల వ్యాపారుల వద్ద చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి గతేడాది ఊరు నుంచి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అతని ఆచూకీ దొరకలేదు. కర్నూలులో ఉన్నాడనే విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించినట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.