![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/KIRAN-2-f.jpg?fit=512%2C252&ssl=1)
సారథి న్యూస్, వనపర్తి: చదువు ద్వారానే దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ అన్నారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో అంబేద్కర్ జాతర కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరచింత విజయ్ కుటుంబాన్ని మంగళవారం కలిశారు. అణగారిన బతుకుల్లో వెలుగులు నింపేందుకు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కృషిచేస్తున్నారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో మనమంతా నడవాలని పిలుపునిచ్చారు. స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్, సాయిబాబా, కురుమూర్తి, మహిపాల్ పాల్గొన్నారు.