![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/ROJAAAFF.jpg?fit=700%2C420&ssl=1)
తాడేపల్లి: ‘ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైనా టీడీపీ అధినేత చంద్రబాబుకు బుద్ధిరాలేదు. పనిగట్టుకొని సీఎం జగన్పై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఆయనను ప్రజలు చెప్పులతో కొట్టేరోజు దగ్గర్లోనే ఉన్నది’ అంటూ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. అంతర్వేదిలో రథం తగలబడిన ఘటనలో చంద్రబాబు పాత్ర ఉందేమోనని అనుమానంగా ఉందని రోజా ఆరోపించారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఈ ఘటనపై తక్షణం సీబీఐ ఎంక్వైరీ వేశారని చెప్పారు. విచారణలో నిజాలు తేలుతాయని చెప్పారు. తన హయాంలో సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా అడ్డుపడ్డ ఈ దుర్మార్గుడు.. ప్రస్తుతం అంతర్వేది ఘటనపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని కోరడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడును ప్రజలు చెప్పులతో కొట్టే రోజులు త్వరలోనే ఉందని ఘాటుగా విమర్శించారు.