Breaking News

ఘనంగా వైఎస్సార్​ వర్ధంతి వేడుకలు

ఘనంగా వైఎస్సార్​వర్ధంతి వేడుకలు

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్​ వైఎస్​ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు కర్నూలు నగరంలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నగరంలోని బుధవారపేట 15 వార్డులో సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇన్​చార్జ్​ బి.వై. రామయ్య ప్రారంభించారు. వైఎస్సార్​ సంక్షేమ పథకాలు జనహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని ఆయన అన్నారు. లక్షలాది మంది విద్యార్థులు చదువుకునేందుకు విద్యపై ప్రత్యేకచర్యలు తీసుకుని ఫీజు రీయింబర్స్​మెంట్​ స్కీంను ప్రవేశపెట్టారని అన్నారు. తాగు, సాగునీటి కోసం ఎన్నో ప్రాజెక్టులను ప్రారంభించారని వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్​సీపీ మహిళా విభాగం వెంకటేశ్ వరమ్మా, వాణి, సుగుణ, సుచరిత, చెన్నమ్మ, జమేల, రైల్వేప్రసాద్, ఆదిమోహన్, ఆసిఫ్, నయీం, కిరణ్, రాజేష్, నవీన్ కుమార్ పాల్గొన్నారు.