![ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/nzpt-2.jpg?fit=677%2C285&ssl=1)
సారథి న్యూస్, నిజాంపేట: ప్రధాని నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి డిమాండ్చేశారు. ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఎగరవేయాలని బీజేపీ నాయకులకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మెదక్జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు మల్లప్ప, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, లక్ష్మణ్ గౌడ్, నరేష్, ప్రశాంత్, కుమార్ పాల్గొన్నారు.