Breaking News

నిరాడంబరంగా బండి సంజయ్​ జన్మదినం

సారథిన్యూస్​, కొత్తగూడెం: బండి సంజయ్​ సారథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్నదని కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ పేర్కొన్నారు. సంజయ్​ జన్మదినం సందర్భంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని స్నేహలత, సంధ్యలత అనాథ శరణాలయంలో బండిసంజయ్​ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథపిల్లలకు స్వీట్స్​, కేక్​ పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగులోనూ బండి సంజయ్ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఒంటెల కరుణాకర్​రెడ్డి, నాయకులు, జిన్నారం విద్యా సాగర్, ఉప్పు రాంకిషన్, తిర్మలపూర్ ఎంపీటీసీ మోడీ రవి, ఉప్పు శ్రీను పటేల్,కాడే నర్సింగమ్, ఐలయ్య, రమేశ్​, లక్ష్మణ్​ తదితరులు పాల్గొన్నారు.