![గోపీచంద్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/GOPICHAND2F.jpg?fit=389%2C450&ssl=1)
యాక్షన్.. సీరీస్ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్ గోపీచంద్ సినిమాలు. ప్రస్తుతం ‘సీటీ మార్’ స్పోర్ట్స్ డ్రామాతో బిజీగా ఉన్న గోపీ చంద్ ఈ చిత్రం తర్వాత తన రూటు మార్చి కొత్త ప్రయోగాన్ని చేయనున్నాడట. డైరెక్టర్ తేజతో ‘అలమేలుమంగ వెంకటరమణ’ సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్తో ఉంటుందట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా స్క్రిప్టు వర్క్ దాదాపు పూర్తి కావొచ్చిందట. గోపీచంద్కు కథ ఫైనల్ వెర్షన్ కూడా వినిపించారట. ‘సీటీ మార్’ పూర్తికాగానే ఈ సినిమా పట్టాలెక్కనుందని.. కీర్తి సురేష్ను హీరోయిన్గా అనుకుంటున్నారని సమాచారం.