Breaking News

గోకుల్​చాట్​ ఓనర్​కు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్:​ తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకు కోరలు చాస్తున్నది. తాజాగా హైదరాబాద్​ కోఠిలోని గోకుల్​ చాట్​ యాజమాని విజయ్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు దుకాణాన్ని మూసివేయించారు. షాప్​లో పనిచేసే 20 మంది సిబ్బందిని క్వారంటైన్​కు తరలించారు. దీంతో ఇటీవల గోకుల్​చాట్​కు వెళ్లిన వారిలో ఆందోళన మొదలైంది. అధికారులు ఇటీవల షాపునకు వెళ్లినవారి వివరాలు సేకరిస్తున్నారు.