![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/harishfff-3.jpg?fit=900%2C450&ssl=1)
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకు కోరలు చాస్తున్నది. తాజాగా హైదరాబాద్ కోఠిలోని గోకుల్ చాట్ యాజమాని విజయ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు దుకాణాన్ని మూసివేయించారు. షాప్లో పనిచేసే 20 మంది సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. దీంతో ఇటీవల గోకుల్చాట్కు వెళ్లిన వారిలో ఆందోళన మొదలైంది. అధికారులు ఇటీవల షాపునకు వెళ్లినవారి వివరాలు సేకరిస్తున్నారు.