Breaking News

గల్లంతైన లారీడ్రైవర్ డెడ్​బాడీ లభ్యం

గల్లంతైన లారీడ్రైవర్ డెడ్​బాడీ లభ్యం

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ సమీపంలో ఈనెల 15న మోయతుమ్మెదవాగులో గల్లంతైన లారీడ్రైవర్ శంకర్ డెడ్​బాడీ శనివారం లభించింది. నీటి ప్రవాహానికి బస్వాపూర్ శివారులోని వాగు ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. గత శనివారం నీటిఉధృతిలో గల్లంతైన లారీడ్రైవర్ శంకర్ గా గుర్తించారు. ఘటన స్థలాన్ని ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీసీ మహేందర్ పరిశీలించారు.
బస్వాపూర్ గ్రామస్తుల చేయూత
లారీ డ్రైవర్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయమందించానే సంకల్పంతో బస్వాపూర్ గ్రామానికి చెందిన ముజాహిద్ పాషా, తాటిపాముల సుధీర్ తదితరులు కొంత డబ్బులు పొగుచేసుకుని రూ.1.1లక్షల చెక్కును ఎంపీపీ కొక్కుల కీర్తి, బస్వాపూర్ సర్పంచ్ సత్తయ్య, ఆరెపల్లె సర్పంచ్ సరోజన, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ఇక్బాల్ పాషా చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.