న్యూఢిల్లీ: అవసరమైనప్పుడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తా, సామర్థ్యం భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్నాయని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. దానికి తగినట్లుగానే విరాట్ ఆటతీరును పూర్తిగా మార్చేసుకుంటాడన్నాడు. ఏ మ్యాచ్ అయినా నిజాయితీగా ఆడటమే కోహ్లీ అతిపెద్ద బలమని చెప్పాడు. ‘కోహ్లీలో నాకు నచ్చిన అంశం ఆటపై అతనికి ఉన్న పట్టుదల, ఆసక్తి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఉండాలనుకుంటాడు. దానికోసం ఎంతకైనా శ్రమిస్తాడు. ఇంతలా కష్టపడే క్రికెటర్ను నేను ఎప్పుడూ చూడలేదు. విరాట్ ఒకే కోణంలో ఆడే ఆటగాడు కాదు. ఫార్మాట్, పరిస్థితులను బట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు. అతనిలో ఉన్న అతిపెద్ద బలం అదే. 2016 ఐపీఎల్లో విరాట్ ఆడిన ఆటే ఇందుకు అతిపెద్ద నిదర్శనం. అప్పట్నించి, ఇప్పటివరకు అతడు ప్రపంచ క్రికెట్ను శాసిస్తూనే ఉన్నాడు’ అని రాథోడ్ వ్యాఖ్యానించాడు.
- June 29, 2020
- Archive
- Top News
- క్రీడలు
- CAPTAIN
- CRIKETER
- KOHLI
- MATCH
- కెప్టెన్
- విరాట్ కోహ్లీ
- Comments Off on కోహ్లీలో నిజాయితీ ఎక్కువ