Breaking News

కొల్లాపూర్​ అభివృద్ధి చెందాలి

కొల్లాపూర్​ అభివృద్ధి చెందాలి

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: కొల్లాపూర్​ మరింత అభివృద్ధి చెందాలని నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్​ ఎల్​.శర్మన్​ ఆకాంక్షించారు. ఆదివారం ఆయన మార్నింగ్​ వాక్​లో భాగంగా కొల్లాపూర్ లో పర్యటించారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆ మేరకు ప్రణాళికలతో అధికారులు ముందుకు సాగాలని సూచించారు. మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. కరెంట్​ బిల్లులు నెలనెలా చెల్లించాలని, విద్యుత్​ను పొదుపుగా వాడాలని సూచించారు. పట్టణంలో డంపింగ్ ​యార్డ్​ పనులను కంప్లీట్​ చేయాలన్నారు. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకే చైర్మన్, కమిషనర్‌, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని, పారిశుద్ధ్య పనులపై పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్​ పలువురు వీధి విక్రయదారులతో మాట్లాడారు. రోడ్ల వెంట మొక్కలు నాటాలని సూచించారు. కలెక్టర్ వెంట మార్నింగ్ వాక్ లో మున్సిపల్ చైర్​పర్సన్​ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ మహముదాబేగం, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.