Breaking News

కొనసాగుతున్న క్లినికల్​ ట్రయల్స్

కొనసాగుతున్న క్లినికల్​ట్రయల్స్

  • వాక్సిన్ తీసుకున్న ఇద్దరు వలంటీర్లు నిమ్స్‌ నుంచి డిశ్చార్జ్​
  • తొలి స్వదేశీ వాక్సిన్ ‘కొవాగ్జిన్‌‌’పై ప్రయోగాలు

సారథి న్యూస్​, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్​ హుమన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తొలి స్వదేశీ వాక్సిన్ ‘కొవాగ్జిన్‌‌’పై హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. సోమవారం నిమ్స్‌ ఆస్పత్రిలో ఇద్దరు వలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిమ్స్ డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత మరోసారి నిమ్స్‌ ఆస్పత్రిలో రక్త నమూనాలను సేకరించి పరీక్షించనున్నారు. 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ చేసినట్లు వెల్లడించారు. 14 రోజులపాటు వలంటీర్ల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని చెప్పారు. ఆ తర్వాత మరోసారి నిమ్స్‌ ఆస్పత్రిలో రక్త నమూనాలను సేకరించి పరీక్షించనున్నారు. వాక్సిన్‌లోని అన్ యాక్టివేటెడ్ వైరస్ వల్ల శరీరంలోని యాంటీ బాడీలు ఏ మేరకు వృద్ధి చెందుతాయి? సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా ఉన్నాయా? అని పరిశీలిస్తున్నారు. అంతా ఓకే అనుకున్న తర్వాత రెండో డోస్ ఇస్తారు. ఇలా మొత్తం 60 మందిపై నిమ్స్‌లో పరీక్షలు చేస్తారు. కొవాగ్జిన్ వాక్సిన్‌ను భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్‌కు ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.