Breaking News

కొడైకెనాల్​లో యువజంట ఆత్మహత్య

యువజంట ఆత్మహత్య

సారథిన్యూస్​, హైదరాబాద్​: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా.. ఖమ్మం రూరల్‌ మండలం… మంగళగూడెం గ్రామానికి చెందిన గోపీకృష్ణ (26)కు 2018లో భద్రాచలం సమీపంలోని చోడవరం గ్రామానికి చెందిన నందిని(26)తో వివాహమైంది. వీరిద్దరూ కొడైకెనాల్​లోని ఓ ఐటీకంపెనీలో పనిచేస్తున్నారు. సంవత్సరం నుంచి అన్నయ్‌ థెరిస్సా యూనివర్సిటీ దగ్గర్లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి దంపతులు తమ ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీళ్లకు కిరాణా సరుకులు తెచ్చిచ్చే ఓ బాలుడు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. వారు పనిచేస్తున్న కంపెనీ వేతనాలు ఇవ్వకపోవడంతో గోపీకృష్ణ దంపతులు కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నట్టు సమాచారం.