Breaking News

కేసీఆర్​ సార్​ మీరే పట్టించుకోవాలే

సారథిన్యూస్​, హైదరాబాద్​: విప్లవకవి వరవరరావును విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్​ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్​ నేత పొన్నాల లక్ష్మయ్య కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. తెలంగాణ వాది అయిన వరవరరావు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం చేసిన ప్రతి పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. బీమాకోరేగావ్​ కేసులో అరెస్టయిన వరవరరావు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉన్నదని చెప్పారు. ఈ కేసు కేంద్రప్రభుత్వం పరిధిలో ఉన్నందున సీఎం కేసీఆర్​ జోక్యం చేసుకొని ప్రధాని మోదీతో చర్చించాలని కోరారు.