![కీర్తిసురేష్ వాయిదాల పద్ధతి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/ker-2F.jpg?fit=550%2C870&ssl=1)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన జోడీ కట్టనుంది కీర్తి సురేష్. ‘గీత గోవిందం’ ఫేమ్ పరుశరామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కనున్న ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్గా కమిటైన కీర్తి ఈ చిత్రంలో బ్యాంక్ ఎంప్లాయిగా కనిపించనుందట. అందుకోసం బ్యాంకులకు సంబంధించిన రుణాలు.. వాయిదాలు..వడ్డీ రేట్లు.. వార్షిక లావాదేవీలు మొదలైన అంశాలను ఔపాసన పట్టే పనిలో పడిందట కీర్తి. బ్యాంక్ మోసాల బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథ ఉంటుందని.. మహేష్ బాబు ఒక బడా బ్యాంక్ మేనేజర్ కొడుకుగా కనిపించనున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్,14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభించనున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.