Breaking News

కించపరిచే రాతలు రాస్తే చర్యలు

మంగళగిరి: సోషల్ మీడియాపై గట్టి నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్​ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. బుధవారం మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తప్పు అయితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగతంగా దూషిస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామన్నారు. నిరాధారమైన వార్తలు రాస్తే 9071666667 నంబర్​కు ఫోన్​ చేయాలని సూచించారు. లాక్ డౌన్ వలన సోషల్ మీడియా హవా కొనసాగిందని, దీని కట్టడికి కసరత్తు చేస్తున్నామన్నారు. గ్రూపు అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.