అబుదాబి: ఐపీఎల్ 13 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇక ఇంటిబాట పట్టింది. ఆదివారం చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పరాజయం చెందడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తద్వారా ప్లే ఆఫ్ రేసు నుంచి వెళ్లిన రెండో జట్టుగా నిలిచింది. పంజాబ్ ముందుగా బ్యాటింగ్ చేసి 153 స్కోరు చేసింది. ఆ లక్ష్యాన్ని ధోని సేన 18.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ఛేదించింది. డుప్లెసిస్(48; 34 బంతుల్లో 4×4, 6×2), రుతురాజ్ గైక్వాడ్(62 నాటౌట్; 49 బంతుల్లో 4×6, 6×1), అంబటి రాయుడు(30 నాటౌట్; 30 బంతుల్లో 4×2) రాణించారు. పంజాబ్ బౌలర్ జోర్డన్ ఒక వికెట్ తీశారు.
మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టాస్ గెలిచిన చెన్నై తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కు దిగింది. అగర్వాల్(26; 15 బంతుల్లో 4×5), రాహుల్(29; 27 బంతుల్లో 4×3, 6×1) స్కోరు బోర్డును నడిపించారు. క్రిస్ గేల్(12), పూరన్(2), మన్దీప్ సింగ్(14), నీషమ్(2) నిరాశపరచడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. కానీ దీపక్ హుడా(62 నాటౌట్; 30 బంతుల్లో 4×3, 6×4) బ్యాట్ ఝుళిపించడంతో కింగ్స్ పంజాబ్ తేరుకుంది. సీఎస్కే బౌలర్లలో ఎన్గిడి మూడు వికెట్లు సాధించగా, తాహీర్, శార్దూల్ ఠాకూర్, జడేజా చెరో వికెట్ తీశారు.
- November 1, 2020
- Archive
- Top News
- క్రీడలు
- CHENNAISUPERKINGS
- IPL13
- KINGSPUNJAB
- ఐపీఎల్ 13
- కింగ్స్పంజాబ్
- చెన్నై సూపర్కింగ్స్
- Comments Off on కింగ్స్ పంజాబ్ ఇంటికి..