షార్జా: ఐపీఎల్13వ సీజన్లో మొదట వరుసగా ఐదు ఓటముల తర్వాత ఒక్కసారి పుంజుకున్న కింగ్స్ పంజాబ్ ఎలెవన్ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. షార్జా వేదికగా జరిగిన 46వ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై కింగ్స్ ఎలెవన్పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్చేసిన కోల్కతా 150 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. లక్ష్యఛేదనలో భాగంగా కేఎల్ రాహుల్(28;25 బంతుల్లో 4×4), మన్దీప్ సింగ్(66 నాటౌట్; 56 బంతుల్లో 4×8 ఫోర్లు, 6×2), గేల్(51; 28 బంతుల్లో 4×2, 6×5) ఆకట్టుకున్నారు. మన్దీప్ సింగ్, క్రిస్ గేల్ జట్టుకు విజయం అందించారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కేకేఆర్స్టార్బ్యాట్స్మెన్లు మోర్గాన్ 25 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్స్లతో 40 పరుగులు చేశాడు. ఆపై నరైన్(6), నాగర్కోటి(6), కమిన్స్(1) వెనువెంటనే పెవిలియన్ బాటపట్టారు. గిల్ 45 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్లతో 57 పరుగులు సాధించాడు. ఫెర్గ్యూసన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ 24 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, రవి బిష్నోయ్, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్ల చొప్పున తీశారు. మురుగన్ అశ్విన్, మ్యాక్స్వెల్ చెరో వికెట్ తీశారు.
- October 26, 2020
- Archive
- Top News
- క్రీడలు
- GAYLE
- IPL13
- KINGSELEVEN PUNJAB
- KL RAHUL
- KOLKATA
- KR
- SHARJAH
- కలకత్తా
- కింగ్స్లెవెన్పంజాబ్
- కేకేఆర్
- షార్జా
- Comments Off on కింగ్స్ పంజాబ్ అజేయం