Breaking News

కాల్పుల్లో సూర్యాపేట ఆర్మీ ఆఫీసర్​ మృతి

సారథిన్యూస్​, సూర్యాపేట: భారత్‌ – చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి మృతిచెందారు. సూర్యాపేటకు చెందిన సంతోష్​ కుమార్​ భారత్​​-చైనా సరిహద్దులో కల్నల్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం ఇరుదేశాల బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో సంతోష్ ప్రాణాలు కోల్పోయాడు.​ ఆర్మీ అధికారులు సూర్యాపేటలోని ఆయన కుటుంబసభ్యులకు మరణవార్తను తెలిపారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. సంతోష్‌ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు.  సంతోష్‌ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

ఆర్మీ జవాన్ తల్లి