![కాంగ్రెస్ఎమ్మెల్యేలు మావెంటే](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/ashok-gehlot-f.jpg?fit=680%2C370&ssl=1)
జైపూర్: కాంగ్రెస్ ఎమ్మెల్యేల సపోర్ట్తోనే తాను ధైర్యంగా ఉన్నానని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. మంగళవారం ఉదయం జరిగిన మూడో సీఎల్పీ సమావేశంలో ఆయన ఈ విషయ చెప్పారు. సచిన్ పైలెట్ ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా ఎమ్మెల్యేలంతా తనతో ఉండి నమ్మకంతో సపోర్ట్ చేశారని అన్నారు. తమకు 115 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందన్నారు. ఆ తర్వాత రాజస్థాన్ కేబినెట్ మీటింగ్ కూడా నిర్వహించారు. రాజస్థాన్ అనిశ్చితి తర్వాత గెహ్లాట్ రెండుసార్లు సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఆ రెండు సమావేశాలకు పైలెట్, అతని ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో వారికి కాంగ్రెస్ నోటీసులు ఇచ్చింది. అంతే కాకుండా పైలెట్, ఇద్దరు మంత్రులను పదవినుంచి తొలగించిన విషయం తెలిసిందే.