Breaking News

కాంగ్రెస్​ నాయకుడికి ఘనసన్మానం

సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు ఇటీవల కాంగ్రెస్ బీసీ సెల్ కరీంనగర్​ జిల్లా చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనను ఘనంగా సన్మానించారు. యూత్ కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థి నేతగా, యువజన నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా దాదాపు 20 ఏళ్లపాటు చేసిన కృషికి పార్టీ అధిష్టానం ఈ పదవి కట్టబెట్టిందన్నారు. కార్యక్రమంలో వెలిచాల మాజీ సర్పంచ్ కాడే శంకర్, వెదిర మాజీ సర్పంచ్​ బాలాగౌడ్, షానగర్ మాజీ సర్పంచ్ నర్సింగం, సీనియర్ నాయకులు పంజాల శ్రీనివాస్, రేణిగుంట బాపురాజ్ పాల్గొన్నారు.