Breaking News

కర్ణాటక డ్రగ్స్​ రాకెట్​లో సినీతారలు!

కర్ణాటకలో మొదలైన డ్రగ్స్​ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ వ్యవహారం ముఖ్యంగా సినీ తారల మెడకు చుట్టుకుంటున్నది. ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్​ లంకేశ్​ గురువారం సీసీబీ ఎదుట హాజరయ్యాడు. అతడు ఎవరెవరి పేర్లు చెప్పాడన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. ప్రముఖ హీరోయిన్​ రాగిణి ద్వివేది కి డ్రగ్స్​ రాకేట్​తో సంబంధాలు ఉన్నట్టు కన్నడ మీడియా వార్తలు వెలువరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె సీసీబీ (సెంట్రల్​ క్రైమ్​ బ్రాంచ్​) ఎదుట హాజరైంది. మరోవైపు ఆమె నివాసముంటున్న అపార్ట్​మెంట్​లో శుక్రవారం సీసీబీ సోదాలు జరిపింది. ఈ సోదాల్లో కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం. మరోవైపు మరోనటి సంజనకు కూడా డ్రగ్స్​ రాకెట్​తో సంబంధాలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె ఫోన్​ స్విచ్ఛాఫ్​ చేసుకోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికే సంజన బాయ్​ఫ్రెండ్​ రాహుల్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాహుల్​ చెప్పిన వివరాల ఆధారంగా మరికొందరిని అరెస్ట్​ చేయనున్నట్టు సమాచారం. అయితే తాజాగా సంజన మీడియాపై ఫైర్​ అయ్యింది. ‘ మీడియా నన్ను ఎందుకు టార్గెట్​ చేసిందో అర్థం కావడం లేదు. నేను ఏమన్నా టెర్రరిస్టునా. నిన్నటి నుంచి నన్ను ఓ ఉగ్రవాది కంటే ఎక్కువగా చూపిస్తున్నారు. రాహుల్​ను ఎందుకు అరెస్ట్​ చేశారో నాకు తెలియదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి’ అంటూ ఆమె విరుచుకుపడ్డారు. కాగా ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.