Breaking News

కరోనా టెస్టులు పెంచండి

సారథి న్యూస్, రామాయంపేట/రామడుగు: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్​ చేసింది. కరోనా వార్డుల్లో పనిచేసే సిబ్బందికి, డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇవ్వాలని కోరింది. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ దవాఖాన ఎదుట, కరీంనగర్​ జిల్లా రామడగులోనూ బీజేపీ నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆయుష్మాన్​ భారత్​ స్కీమ్​లో చేర్చాలని డిమాండ్​ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. కార్యక్రమంలో రామడుగు బీజేపీ మండల అధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి, రామయంపేట బీజేపీ మండల అధ్యక్షుడు శివరాములు, నాయకులు శంకర్ గౌడ్ , చంద్రశేఖర్, గణేష్, దిలీప్ కుమార్, నరేష్, శేఖర్ ,బాజా మల్లారెడ్డి శ్యాములు, చారీ తదితరులు పాల్గొన్నారు.