![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/CARONA-TESTSSFF.jpg?fit=700%2C330&ssl=1)
సారథి న్యూస్, నారాయణఖేడ్: లక్షణాలు ఉన్నవాళ్లందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మెదక్ జిల్లా కంగ్టి పీహెచ్సీ డాక్టర్ మనోహర్రెడ్డి సూచించారు. మండలంలో రోజురోజుకూ కరోనా పెరుగుతున్నదని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. భౌతికదూరం పాటించాలని సూచించారు. బుధవారం కంగ్టి పీహెచ్సీలో కరోనా పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారందరినీ క్వారంటైన్లో ఉండాలని ఆయన సూచించారు.