Breaking News

కరోనా టెస్టులు చేయించుకోండి

సారథి న్యూస్​, నారాయణఖేడ్​: లక్షణాలు ఉన్నవాళ్లందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మెదక్​ జిల్లా కంగ్టి పీహెచ్​సీ డాక్టర్​ మనోహర్​రెడ్డి సూచించారు. మండలంలో రోజురోజుకూ కరోనా పెరుగుతున్నదని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. భౌతికదూరం పాటించాలని సూచించారు. బుధవారం కంగ్టి పీహెచ్​సీలో కరోనా పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్​ గా​ నిర్ధారణ అయింది. వారందరినీ క్వారంటైన్​లో ఉండాలని ఆయన సూచించారు.