Breaking News

కరోనా కట్టడిలో ఫెయిల్​

కరోనా కట్టడిలో విఫలం

సారథి న్యూస్​, గద్వాల: కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్​ నేత షేక్​ షావలీ ఆచారి విమర్శించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం ఐసోలేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని ఆరోపించారు. గద్వాల జిల్లాలో తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అనారోగ్యంతో ఉన్నవారందరికీ టెస్టులు చేయాలని కోరారు. టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, మంత్రులు కార్పొరేట్​ దవాఖానల్లో వైద్యం చేయించుకుంటూ.. ప్రజలను మాత్రం గాంధీ ఆస్పత్రికి పంపుతున్నారని విమర్శించారు.