Breaking News

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి

సారథిన్యూస్, చొప్పదండి: కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు. శుక్రవారం కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని తహసీల్దార్​ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు మౌనప్రదర్శన చేపట్టారు. అనంతరం తహసీల్దార్​ అంబటి రజితకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతున్నారని .. వెంటనే కోవిడ్​19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్​ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు బత్తుల లక్ష్మీనారాయణ, తోట కొటేశ్, నాయకులు తిరుపతి, శ్రావణ్, రాజిరెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.