Breaking News

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి

సారథి న్యూస్, అచ్చంపేట: రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. కోవిడ్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదివారం నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, బుడ్డతండా, హాజీపూర్ గ్రామాల సర్పంచ్​లకు వినతిపత్రాలు ఇచ్చారు. లాక్​డౌన్ ​సందర్భంగా వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు, విద్యార్థులు, ప్రైవేట్​ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కరోనాకు ఉచితంగా వైద్యచికిత్సలు అందించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హరీశ్​నాయక్, గణేష్, అజయ్, శ్రీనివాస్ నాయక్, లక్ష్మి, పరుశరాములు పాల్గొన్నారు.