Breaking News

కరోనాతో ఒకేరోజు 10 మంది మృతి

కరోనాతో ఒకేరోజు 10 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి మరింత పెరుగుతోంది. శుక్రవారం(24 గంటల్లో) 2,478 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,35,884కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 866కు చేరింది. వ్యాధి బారినుంచి ఒక్కరోజే 2,011 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,02,024కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 32,994 ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.14 శాతంగా నమోదైంది. కాగా, తెలంగాణలో రోగుల రికవరీ రేటు 75.0 శాతం ఉంది. అలాగే భారత్‌లో మరణాల రేటు 1.74 శాతం ఉండగా, తెలంగాణలో 0.63 శాతం నమోదైంది. రాష్ట్రంలో ఒకేరోజు 62,543 పరీక్షలు చేశారు. ఇలా ఇప్పటివరకు 16,05,521 టెస్టులు చేశారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​ బులెటిన్​ను విడుదల చేసింది.