Breaking News

కరోనాతో ఏఎస్పీ మృతి

కరోనాతో ఏఎస్పీ మృతి

వరంగల్: జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి కరోనాతో మృతిచెందారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక కాలం పాటు సేవలు అందించిన పోలీస్ ఆఫీసర్​గా గుర్తింపు ఉంది. వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్​ నిర్ధారణ కావడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయారు. మేడారం స్పెషల్​ఆఫీసర్​గా మంచి అనుభవం ఉంది. 1989 బ్యాచ్ ఎస్సై ద్వారా పోలీస్ శాఖలోకి వచ్చిన దక్షిణమూర్తి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం జగిత్యాల అడిషనల్ ​ఎస్పీగా పనిచేస్తున్నారు.