Breaking News

కరోనాకు ఆరోగ్యశ్రీ వైద్యం



సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా పేషంట్లకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యమందించాని టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి డిమాండ్​ చేశారు. శుక్రవారం ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ 50వ జన్మదిన వేడుకల్లో మాట్లాడారు. ప్రపంచ మహమ్మారి కరోనా వైరన్ రోజురోజుకు విజృంభిస్తోందని దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన పట్టించుకోలేదన్నారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. అనంతరం 50మంది పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి లింగమూర్తి, డీసీసీ కార్యదర్శలు సత్యనారాయణ, రవీందర్, హుస్నాబాద్ పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్లు పద్మ, స్వర్ణలత, రాజు, శ్రీనివాస్, సరోజన, లావణ్య, మాజీ ఎంపీటీసీ హాసన్, సింగిల్ విండో డైరెక్టర్ కుమారస్వామి పాల్గొన్నారు.