Breaking News

కరెంట్ షాక్​తో మహిళ మృతి

కరెంట్ షాక్​తో మహిళ మృతి

సారథి న్యూస్, మెదక్: ప్రమావశాత్తు కరెంట్ షాక్ తో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శనివారం మెదక్​ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక గోల్కొండ వీధికి చెందిన బిస్మిల్లా బీ (55) తన ఇంటి ఆవరణలో చెట్టు వద్ద పేరుకున్న చెత్తాచెదారం తొలగిస్తుంగా పైన ఉన్న విద్యుత్​ వైర్లకు చేతి తగిలింది. దీంతో కరెంట్​ షాక్ తో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బిస్మిల్లా బీ డెడ్​ బాడీతో బాధిత కుటుంబసభ్యులు, బంధువులు పట్టణంలోని ఫ్యూజ్​ ఆఫ్​ కాల్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. మెదక్​ మున్సిపల్​ చైర్మన్​ చంద్రపాల్ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై మెదక్ టౌన్​ పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.