Breaking News

ఓటీటీ మంచిదే కానీ..

ఇండియాలో ప్రఖ్యాత డైరెక్టర్స్​లో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఒకరు. ఇండియన్ చిత్రాలను వరల్డ్ వైడ్ రేంజ్​లో ప్రజెంట్ చేసే డైరెక్టర్ శంకర్ ఎక్కువ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు.. భారీ కమర్షియల్ హంగులున్న చిత్రాలు నిర్మించడంలో దిట్ట. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమల్ హాసన్ ప్రధాన హీరోగా ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ‘ఇండియన్ 2’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ చిత్రం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 1996లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది. మొదట ఈ చిత్రాన్ని 2021లో విడుదల చేయాలని అనుకున్నారు శంకర్.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల తేదీ 2022కి మారే అవకాశం ఉంది.
ఇదిలాఉండగా, డైరెక్టర్ శంకర్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా రెండున్నర నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అయ్యాయి. దీంతో సినిమాల విడుదల ఆగిపోయాయి. అయితే థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ చేస్తారో లేదో అనే సందిగ్ధంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ తమ చిత్రాలను డైరెక్టుగా ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి కానీ స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు ఏవీ ఓటీటీ రిలీజ్ కాలేదు. ఈ విషయంపై దర్శకుడు శంకర్ స్పందించారు. థియేటర్ లో సినిమా చూసిన ఆనందాన్ని ఓటీటీ ఇవ్వలేదని.. భవిష్యత్​ ఓటీటీదే అయితే నేను సినిమాలు ఎలా తీయాలని ప్రశ్నించారు. ఇక సినిమాల విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుందని.. ఈ నేపథ్యంలో ఎలాంటి సినిమాలు తీయాలో అర్థం కావడం లేదని.. థియేటర్ అయినా ఓటీటీ అయినా నా సినిమాలు అన్ని రకాల ఆడియన్స్ ని అలరిస్తాయని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నిర్మాతలకు నష్టాలు రానంతవరకు సినిమాలు ఓటీటీలో విడుదలవడం మంచిదేనని పేర్కొన్నారు.