Breaking News

ఓటీటీలో జాన్వీ సినిమా

ఓటీటీలో జాన్వీ సినిమా

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్​లో నటించింది. ప్రస్తుతం ‘గుంజన్ సక్సేనా, రూహిఅప్జానా, దోస్తానా 2’ సినిమాలు లైన్​ పెట్టి చేస్తోంది. ఈ చిత్రాల్లో జాన్వీ ప్రధానపాత్రలో నటిస్తున్న ‘గుంజన్ సక్సేనా’ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గత ఏడాది డిసెంబర్​లోనే సినిమా పూర్తయినా పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పటి వరకూ రిలీజ్ కాలేదు. ఇక థియేటర్లను ఓపెన్ చేయడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదు కావునా ఈ చిత్ర యూనిట్ వచ్చేనెల ఆగస్టు 12న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్​లో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నామని అధికారికంగా తెలిపింది.

జాన్వీ కూడా ఇన్​స్టాగ్రామ్​లో ‘యుద్ధానికి వెళ్లిన భారతదేశపు మొదటి మహిళ గుంజన్ సక్సేనా కథతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినీ జర్నీ నాకెంతో స్ఫూర్తినిచ్చింది.. అదే విధంగా సినిమా చూసి మీరు కూడా ఫీల్ అవుతారని.. ఆగస్టు 12న మీ ముందు ల్యాండింగ్ అవుతున్నా..’ అంటూ పోస్ట్ చేసింది. ఈ బయోపిక్ గురించి జాన్వీ ఫ్లైట్ నడపడం.. యుద్ధ విద్యలు నేర్చుకోవడం .. లాంటి విషయాలు తెలినవే. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, జీ స్టూడియోస్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో జాన్వీ తండ్రిగా ప్రముఖ నటుడు పంక‌జ్ త్రిపాఠి నటించగా, మరొక నటుడు అంగద్ బేడీ జాన్వీకి సోదరుడిగా కనిపించనున్నాడు.